NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోట‌ళ్లు బంద్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు తొలగించి ముఖ్య కూడళ్లలో ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3,096.40 కోట్ల్ల అంచనాలతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్టు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.

                                 

About Author