PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజారెడ్డి నగర్ కాలనీలో పాస్టర్లకు ఇల్ల స్థలాలు కేటాయించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణ సమీపంలోని  రాజా రెడ్డి నగర్ కాలనీ లో పాస్టర్లకు ఇళ్ళు స్థలాలు కేటాయించాలని  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు ప్రభుత్వానికి విన్నవించారు. మంగళవారంపత్తికొండలో పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు పాల్గొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారు గెలిచాక అన్నివిధాల సహాయం చేస్తామని చెప్పి నేడు మోసం చేశారాని పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు వాపోయారు. పాస్టర్స్ కు సొంత గృహలను కట్టించి ఇస్తాం అని చెప్పి నేడు స్థలాలు సైతం ఇవ్వని పరిస్తితి ఏర్పడిందన్నారు. క్రైస్తవుల సమాధులకు స్మశానవాటిక ఏర్పాటు చేస్తాం అని చెప్పి టీడీపీ, వైసీపీ మోసం చేశారనీ వారు వాపోయారు. క్రైస్తవులకు కమిటి హాలు నిర్మించి ఇస్తాం అని చెప్పి నేడు కనీసం స్పందించని దుస్తితి అని వారన్నారు. పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ రాజా రెడ్డి నగర్ కాలనీ ఏర్పాటు చేసింది అని, అందులో కొన్ని స్థలాలు ఇంకా ఉన్నట్లు ఈ విషయంపై ఎమ్మార్వో సబ్మిట్ చేసిన రిపోర్ట్ ద్వారా తెలిసిందనీ అన్నారు. రాజారెడ్డి నగర్ కాలనీ లో పాస్టర్లకు స్థలాలు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుతూ అదే విధంగా ఇళ్ళు మంజూరు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా కృషి చేస్తామని తెలిపారు. ఇంకా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి అని కోరారు. జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాల క్రైస్తవులను మోసం చేశారని తెలిపారు.పాస్టర్ల గౌరవ వేతనం సైతం ఇవ్వడం లేదని అన్నారు.

About Author