మూల పెద్దమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/05/9-16.jpg?fit=550%2C248&ssl=1)
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలో కొలువైన మూల పెద్దమ్మ దేవస్థానం నందు సోమవారం నాడు ఆలయ అధికారి మోహన్, ఆలయ చైర్మన్ చిన్నన్న మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను రెండు నెలల గాను హుండీ ఆదాయం ఆరు లక్షల 780 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారి మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారులు పివి రాజేష్ బాబు, మోహన్, ఆలయ సిబ్బంది, కమిటీ సిబ్బంది, వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.