PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ మీ పనులన్నీ చేస్తా…’

1 min read

తాగునీరు, మరుగుదొడ్ల, రోడ్లు, వీధిలైట్లు అన్నీ ఏర్పాటు చేస్తా…

  • ఒక్క అవకాశం ఇవ్వండి… గెలిపించండి…
  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు: నిత్యం అందుబాటులో ఉండి…. సేవ చేస్తా.. ఒక్కసారి అవకాశం ఇచ్చి.. గెలిపించండని అభ్యర్థించారు ఆదోని కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా. పార్థసారధి. మీరడిగిన రోడ్లు, వీధిలైట్లు, మరుగుదొడ్లు, తాగునీరు…. సౌకర్యాలు కల్పిస్తాను.. అందుకు నన్ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బుధవారం పట్టణంలోని  ఎల్​ఐసీ, ఎంఐజీ, కునిమల కాలనీలలో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ రోడ్లు, మరుగుదొడ్లు, వీధిలైట్లకు మంజూరైన నిధులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి మింగేశాడని, ఇంకోసారి ఆయనకు ఓటు వేస్తే.. మరింత దెబ్బతింటారని పేర్కొన్నారు. భూకబ్జా, ఇసుక, మద్యం, రేషన్​ మాఫియా తోపాటు వీధిరౌడీలను పెంచిపోషిస్తున్న ఎమ్మెల్యేకు ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. ‘ నా పేరు డా. పార్థసారధి.. నేను డాక్టర్​ను.. కబ్జాలు చేయను…. మీ డబ్బును దోచుకోను..’ అని స్పష్టమైన హామీ ఇచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఒక్కసారైనా మీ సమస్యలను పరిష్కరించారా… అని ప్రజలను ప్రశ్నించారు. మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తిని… మీ సమస్యలను వినని వ్యక్తికి ఓటు వేయొద్దని సూచించారు.  బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి.. తనను గెలిపిస్తే… మీ సమస్యలన్నీ దగ్గరుండి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ప్రజలకు కూటమి అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ–జనసేన– టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *