PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ వస్తే ప్రజల ఆదాయం పెరుగుతుంది

1 min read

కర్నూల్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్

కర్నూలు, పల్లెవెలుగు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆదాయం పెరుగుతుందని కర్నూల్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 13వ వార్డు భాస్కర్ నగర్, గాంధీ నగర్ లో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ప్రజల ఇళ్ల వద్దకు, వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర సంపదను పెంచుతారని అన్నారు. కర్నూలులో తన ఆరు గ్యాంరటీలు అమలు చేయడం ద్వారా నగరం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆర్జా రామకృష్ణ, విఠల్ శెట్టి, శ్రీనివాసరెడ్డి, సురేష్, రాజేశ్, సురేంద్ర, శ్రీనివాసులు, ఏలియా, తదితర నాయకులు, బూత్‌ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.

About Author