PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఆ పేర్ల‌తో పిలిస్తే.. ఇక నుంచి జైలుకే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో నాయిబ్రాహ్మ‌ణుల‌కు ఊరటనిచ్చే మరో నిర్ణయం సీఎం జ‌గ‌న్ తీసుకున్నారు. వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందన్న వాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా జగన్ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం ఇకపై నాయీ బ్రహ్మణుల్ని మంగలి, మంగలోడ, బొచ్చగొరిగావాడా, మంగలిది, కొండమంగలి అనే పదాలతో పిలవకూడదిని జీవోలో పేర్కొన్నారు. ఈ పదాల వాడకాన్ని నిషేధిస్తూ జీవోలో స్పష్టం చేశారు. కేవలం నిషేధించామని చెప్పడమే కాదు.. ఈ పదాలతో వారిని ఎవరైనా పిలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

                           

About Author