PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంతియాజ్​ కు.. బ్రహ్మరథం…

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు నగరంలోని 2వ వార్డు బంగారుపేటలో కర్నూలు నియోజకవర్గ వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి A.Md. ఇంతియాజ్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి సోమవారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి… ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. సంక్షేమం… అభివృద్ధి కావాలంటే మళ్లీ సీఎం జగన్​ కు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనటువంటి ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

About Author