PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంతియాజ్​ను భారీ మెజార్టీతో గెలిపించండి..

1 min read

వైసీపీ హ్యాట్రిక్​ కొట్టాల్సిందే….

  • కర్నూలు అభివృద్ధి… బాధ్యత నాది..
  • సిద్ధం సభలో సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు:వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి రిటైర్డు ఐఏఎస్​ ఇంతియాజ్​ ను  భారీ మెజార్టీతో గెలిపించాలని కర్నూలు ప్రజలను సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి కోరారు.  కర్నూలు ప్రజలు రెండు సార్లు వైసీపీ కి అవకాశం ఇచ్చారని, ఈ సారి కూడా వైసీపీకి ఓటు వేసి హ్యాట్రిక్​ సాధించేలా చూడాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి…. ఇంతియాజ్​ ను గెలిపిస్తే … అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాడని తెలిపారు. కలెక్టర్​గా విధులు నిర్వర్తించిన ఇంతియాజ్​… ఆయన ఆలోచన విధానం స్మార్ట్​గా ఉంటుందని, కర్నూలు అభివృద్ధికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా… అందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి హామీ ఇచ్చారు.  ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఇంతియాజ్​ను, ఎంపీగా బీవై రామయ్యను గెలిపించాలని  నగర ప్రజలను అభ్యర్థించారు. సిద్ధం సభలో పాణ్యం ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్​ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, వైసీపీ నాయకులు,కార్యకర్తలు,  ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author