PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమిలో..విభేదాల్లేవు..

1 min read

సమన్వయంతో…విజయం సాధిస్తాం…

  • ఓర్వలేకనే…దుష్ర్పచారం….
  • ఆదోని కూటమి అభ్యర్థి డా.పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:కూటమి(బీజేపీ–జనసేన–టీడీపీ)లో విభేదాలు లేవని… సమన్వయంతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆదోని కూటమి అభ్యర్థి డా.పార్థసారధి.  కూటమి కలిసివస్తే… గెలుపు తథ్యమనే… కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆదివారం పట్టణంలోని కల్లుబావిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, టీడీపీ సీనియర్​ నాయకులు బుద్ధారెడ్డి, జనసేన నాయకులు మహేష్​ యాదవ్​తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ కల్లుబావిలో సమస్యలు అనేకం ఉన్నాయని, కానీ పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఐదేళ్ల కిందట నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా… రంగులు మాత్రమే వేయించిన జగన్​ సర్కారు తామే కట్టించినట్లు గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి చేసినన్నీ భూ కబ్జాలు ఎవరూ చేసి ఉండరన్న డా. పార్థసారధి… తాను అవినీతి చేయనని, సేవ మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. ఒక్క చాన్స్​ అని వచ్చిన సీఎం జగన్​ మోహన్​ రెడ్డి… రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడన్నారు.  సార్వత్రిక ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, తనను గెలిపిస్తే ఆదోనిని అభివృద్ధి చేసి చూపెడతానన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదిస్తే… ఎమ్మెల్యేగా ఆదోని ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా డా. పార్థసారధి విజ్ఞప్తి చేశారు.

About Author