PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధిలో.. దేశానికే ఆదర్శం

1 min read

– మంత్రి శ్రీనివాస్ గౌడ్​
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్​నగర్​ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. కోవిడ్​ నివారణకు సీఎం కేసీఆర్​ తీసుకుంటున్న నిర్ణయాలు కీలకంగా మారాయని, 50వేల పోస్టులను వైద్యవృత్తిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదల చేశారన్నారు. వైద్యులు, నర్సులు, ల్యాబ్​ టెక్నిషియన్స్​ తదితర విభాగాలలో పోస్టులు నియమించేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం గుడ్డి మల్కాపూర్ గ్రామనికి చెందిన కావలి అంజిలయ్య, గొల్ల బాలరాజు, రాజేందర్ రెడ్డి,శశిధర్ రెడ్డి,సాయన్న,గంగపూరి,మట్ట చెన్నయ్య,రాజుతో పాటు 50 మంది నాయకులు మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కావలి అంజిలయ్య మాట్లాడుతూ టీఆర్​ఎస్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి పార్టీలో చేరామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author