PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టైక్వాండోలో.. ప్రతిభ చాటాలి

1 min read

ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ

పల్లెవెలుగు: క్రీడాకారులు టైక్వాండోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ప్రముఖ వైద్యులు డా. శంకర్​ శర్మ. బుధవారం నగరంలోని శ్రీ లక్ష్మినరసింహ కళ్యాణ మండపం హాల్​లో టైక్వాండో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న చిన్నారులకు కిట్​ బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు శంకర్​ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు, ఏ. రోహిత్ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అకాడమీ ఇంచార్జ్ మల్కారి రవి ధర్మ గారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author