NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రికార్డు స్థాయిలో శ్రీ మఠం హుండీ ఆదాయం

1 min read

– రూ 4 కోట్ల 15 లక్షల 32 వేల 738

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం  శ్రీ మఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు.  మంగళవారం హుండీ లెక్కింపు పూర్తి కావడంతో జనవరి నెల 33 రోజుల  రూ 4 కోట్ల 15 లక్షల 32 వేల 738 రూపాయలు నగదు,  44 గ్రాములు బంగారం,  3642 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు. జనవరి నెల లో ఎక్కువ గా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భారీ ఆదాయం వచ్చిందని మఠం మేనేజర్ తెలిపారు. శ్రీ మఠం చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఆదాయం రాలేదని ఇదే మొదటిసారి అని  శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు.

About Author