PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆహారం పై భారత ఆటగాళ్ల అసంతృప్తి

1 min read

పల్లెవెలుగువెబ్ : టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆహారం విషయంలో ఇబ్బంది పడుతోంది. నెదర్లాండ్స్ తో మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న రోహిత్ సేన.. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నది. అయితే, ప్రాక్టీస్ సమయంలో అందించిన ఆహారం బాగా లేకపోవడంతో కొందరు క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో, కొంత మంది తమ హోటల్ గదులకు తిరిగి వెళ్లి ఆహారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అన్ని జట్లకు ప్రాక్టీస్ తర్వాత దాదాపు ఒకే రకమైన ఫుడ్ ఇస్తున్నారు. అయితే భారత ఆటగాళ్లకు వేడి ఆహారాన్ని అందించడం లేదు. తీవ్రమైన శిక్షణ తర్వాత ఆటగాళ్లు వేడి వేడి ఆహారాన్నే తీసుకుంటారు. దాంతో, చల్లటి ఆహార పదార్థాలను తిప్పి పంపించి, తమకు నచ్చిన ఫుడ్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.

About Author