PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

20 గేట్ల ద్వార స‌ముద్రంలోకి…

1 min read

పల్లెవెలుగు వెబ్ : ఎగువ‌న ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ జెన్ కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. దిగువ‌కు నీటిని విడుద‌ల చేయ‌డంతో ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం వ‌చ్చి చేరుతోంది. మొత్తం 20 గేట్ల ద్వార 8,340 క్యూసెక్కుల నీటిని స‌ముద్రంలోకి వ‌దులుతున్నారు. బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీ పూర్తీ స్థాయి నీటి నిల్వలు ఉండ‌టంతో ..అద‌న‌పు నీటిని నిల్వ చేయ‌లేని ప‌రిస్థితిలో నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ నుంచి పులిచింత‌ల ప్రాజెక్టు నుంచి 39,700 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇక్కడ తెలంగాణ జెన్ కో విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డంతో 7,200 క్యూసెక్కుల నీటికి దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ నుంచి 62,446 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కుల నీరు దిగువ‌కు విడుద‌ల అవుతోంది.

About Author