PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీకెండ్ లో రెచ్చగొట్టడం తప్పా.. చేసేదేమీ లేదు : పవన్ పై రమేష్ ఫైర్

1 min read

పల్లెవెలుగువెబ్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించి జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. కొంతమంది పిల్ల సైకోలను వెంటేసుకుని వచ్చి గుంకలాంలో సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వీకెండ్ లో ఇక్కడికొచ్చి జనాన్ని రెచ్చగొట్టి మళ్లీ హైదరాబాద్ పారిపోవడం తప్ప నువ్వు చేసేది ఏముంది? అంటూ విమర్శించారు. ఒక్కసారి గడపడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చి చూస్తే ప్రజలు మమల్ని తిడుతున్నారో, అభినందిస్తున్నారో తెలుస్తుంది అని జోగి రమేష్ హితవు పలికారు.

About Author