PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలుకు తరలి వెళ్లిన ఉద్యోగ జేఏసీ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ పిలుపుమేరకు కర్నూలు జిల్లా పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న జేఏసీ ర్యాలీకి మంగళవారం పత్తికొండ నియోజకవర్గం ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ, ఫిబ్రవరి 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్నికి పెద్ద ఎత్తున జేఏసీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన బకాయిలను సాధించుకోవడానికి ప్రభుత్వ మెడలైన వొంచి సాధించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవికుమార్.రంగస్వామి.నాగేంద్ర.శ్రీదర్.రామ్ మోహన్ రెడ్డి.శ్రీనివాసులు.శ్రీ ఆంజనేయ.వరపుత్రుడు. శ్రీరాములు. జయరాం.నాయుడు.రాజప్ప.తదితరులు పాల్గొన్నారు.

About Author