PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్

1 min read

– వైసిపి పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు
– ముందుగా నగరంలోని కొండారెడ్డి బురుజు నందు మీడియాతో సమావేశం
– 52వ వార్డులో అట్టహాసంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం
– 2 లక్షల కోట్లు సంక్షేమానికే ఖర్చు చేసిన ఘనత సిఎం జగన్ గారికి సాధ్యం
– వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలు సంతృప్తి
– మేనిఫెస్టోలో ఇచ్చిన 98% హామీలు అమలు
పల్లెవెలుగు వెబ్ కర్నూల్ : వైయస్ఆర్ సిపి ప్రభుత్వ నాలుగేళ్ల పాలన పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని వైయస్ఆర్ సిపి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, నియోజకవర్గ అబ్జర్వర్ కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారు, నగర మేయర్ బి.వై రామయ్యా గారు, నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ గారు అన్నారు.శుక్రవారం 52వ వార్డులో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కర్నూల్ కొండారెడ్డి బురుజు నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డు నాయకులు కార్పొరేటర్లు స్వాగతం పలికారు. 52వ వార్డ్ యస్. నాగప్ప స్ట్రీట్ ఓల్డ్ బస్సు స్టాండ్ సమీపంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి ప్రజా మద్దతు బుక్ లో నమోదు చేశారు. అనంతరం వారి ఫోన్ ద్వారా 8296082960 నెంబర్ కి మిస్డ్ కాల్ చేయించారు. అలాగే ఇంటి యజమాని అనుమతితో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్ ను అతికించారు.ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, నియోజకవర్గ అబ్జర్వర్ కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారు, నగర మేయర్ బి.వై రామయ్యా గారు, నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ గారు, సీనియర్ నాయకుడు గడ్డం రామకృష్ణ గారు, మరియు కార్పొరేటర్లు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పాలనను వై.యస్.ఆర్ కుటుంబం చేస్తుందని కొనియాడారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇంటింటికీ తిరిగి మెగా సర్వే చేస్తున్నామని, తద్వారా ప్రజలకు ఇంకా మంచి చేసే పనులు ఉన్నాయేమో తెలుసుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నామన్నారు. వైయస్ జగన్ అన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకే 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అతియేశక్తి కాదన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ ఎమ్మెల్యే, మేయర్, అబ్జర్వర్, నగర అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author