PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్యకర్త మృతికి నివాళి అర్పించిన జయసూర్య

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో  1వ వార్డ్ కు చెందిన టిడిపి కార్యకర్త కాటేపోగు నాగేంద్ర(40)అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు జయసూర్య ధైర్యాన్ని ఇచ్చారు.కుటుంబ యజమాని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు శోక సంద్రంలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ సీనియర్ నాయకులు నిమ్మకాయల మోహన్, కాలాకర్,వంశీ,నిమ్మకాయల రాజు,ప్రేమ్,లాలు,నాగేంద్ర, బోల్లేదుళ్ల రాజు, ప్రవీణ్(రగడ),కాటేపోగు నాగసురేష్,మహేష్,కళ్యాణ్,సన్నీ,ప్రమోదు,బోల్లేదుల సామెలు ముఖ్య నాయకులు నివాళులు అర్పించడం జరిగింది.

About Author