PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపే జాబ్ మేళా

1 min read

పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 4వ తేదీన భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 15 కంపెనీల్లో 1000కి పైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మిరాకిల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్, యలమంచిలి సాఫ్ట్ వేర్ ఎక్స్పోర్ట్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్, ఏసిటీ ఫైబర్ నెట్, డీమార్ట్, ముత్తూట్ ఫైనాన్స్, లలితా జ్యువెల్లరీ తదితర సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు ఏపీలో ఎక్కడైనా లేదా తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది.

About Author