PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడప సబ్​జైలు ఖైదీ…కర్నూలు జీజీహెచ్​లో మృతి

1 min read

15 రోజులుగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి

పల్లెవెలుగు వెబ్​: కడప సబ్​జైలు ఖైదీ.. కర్నూలు సర్వజన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వెలుగోడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్​  తెలుగు రామాంజనేయులు (56) ఓ మర్డర్​ కేసులో ఆరేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బీపీ, షుగర్​ వల్ల గత నెల రోజులుగా కడప ప్రభుత్వలో చికిత్సపొందాడు. ఆరోగ్యం కుదట పడకపోవడంతో రామాంజనేయులును సబ్​జైలు అధికారులు కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ కొన్ని రోజులుగా చికిత్సపొందుతున్నాడు. కోలుకోలేక మంగళవారం మృతి చెందినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అయితే రామాంజనేయులు గతంలో హార్ట్​కు స్టంట్ వేసుకున్నాడని వైద్యులు పేర్కొన్నారు. కాగా కడప సబ్​జైలు అధికారులు రామాంజనేయులుకు త్వరగా వైద్య చికిత్సలు చేయించడంలో విఫలమయ్యారని, అందుకే మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు.

About Author