PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాళికా మాత నిమజ్జనం కార్యక్రమం – ఎస్వీ దంపతులు

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : స్థానిక రాంబోట్ల దేవాలయం లో ప్రతిష్టించిన కాళి కా మాత నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు మరియు శ్రీమతి విజయ మనోహరి గారు. వేద పండితులు వారికీ సాదర స్వాగతము పలికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఎస్ వి దంపతులు భక్తి శ్రద్దల తో నిమ్మజ్జన ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన రాంబోట్ల దేవాలయం లో నెలకొల్పిన మహాతల్లి కరుణా కటాక్షలు కర్నూల్ నగర ప్రజల ఫై ఉండాలని తాము ప్రార్థన చేసినట్లు తెలిపారు. శ్రీమతి విజయ మనోహరి గారు మాట్లాడుతూ పాత నగరం ఎంతో ఆధ్యాత్మిక కలిగిన ప్రాంతం అని కుల మతాల కు అతీతంగా ఇక్కడి ప్రజలు కలిసి మెలసి జీవిస్తారు అని అన్నారు. కార్యక్రమం లో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మరియు ఎస్ వి యూత్ పాల్గొన్నారు.

About Author