NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`కార్తికేయ‌-2` క‌లెక్ష‌న్ల సునామీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 15.44 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11.54 కోట్ల షేర్‌, 17.80 కోట్ల గ్రాస్‌ వసూలు సాధించింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో రోజు రోజుకి థియేటర్స్‌ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరుసగా.. 3.50 కోట్లు, 3.81 కోట్లు, 4.23 కోట్లు సాధించి, నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది.

                                   

About Author