PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎ.పి.ఎప్సెట్-2024 ఇంజనీరింగ్లో కర్నూలు శ్రీ చైతన్యదే అగ్రస్థానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ రోజు విడుదలైన ఎ.పి. ఎప్సెట్ 2024 ఫలితాలలో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు తమ ప్రతిభతో అగ్రస్థానంలో నిలిచారు. ఇంజనీరింగ్ విభాగం నందు పి.ప్రనీత్ రెడ్డి 188వ ర్యాంకుతో కర్నూలు జిల్లాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడని శ్రీ చైతన్య కళాశాలల ఎ.జి.ఎమ్. మురళీకృష్ణ తెలియజేశారు. అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగం నందు తమ విద్యార్థి పి.ఇమామ్ ఖాసీంబీ 753వ ర్యాంకు మరియు ఎప్సెట్ నందు 2000ల లోపు 4 ర్యాంకులు, 5000ల లోపు 17 ర్యాంకులు, 10000 లలోపు 64 ర్యాంకులు సాధించినట్లు తెలియజేశారు.తమ సంస్థనుంచి అనేక మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో డీన్ సరళ , డీన్ బాలాజీ అధ్యాపక బృందం పాల్గొన్నారు.ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను కళాశాలలో జరిగిన అభినందన సభలో ప్రశంసించారు.

About Author