PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌జ‌ల మద్దతుతో కర్నూలును అభివృద్ధి చేస్తా.. క‌ర్నూలు టిడిపి ఇంచార్జి

1 min read

తెలుగుదేశం పార్టీలో చేరిన ఇల్లూరు న‌గ‌ర్, గరీబ్‌న‌గ‌ర్‌ వాసులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూల్ న‌గ‌ర వాసుల సంక్షేమం త‌న బాధ్య‌త‌గా తీసుకుంటాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో 43వ వార్డు ఇల్లూరు న‌గ‌ర్ కు చెందిన‌ సురేష్‌తో పాటు 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. అనంత‌రం టిడిపి యువ నాయ‌కుడు ఇమ్రాన్ ఆధ్వ‌ర్యంలో గ‌డ్డ ప్రాంతానికి చెందిన మ‌హ‌మ్మ‌ద్‌తో పాటు యువ‌కులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ అంద‌రికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌కంతో తెలుగుదేశం పార్టీలో చేరిన ప్ర‌తి ఒక్కరికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపికి ప్ర‌జ‌లంతా ఓటు వేసే విధంగా పార్టీలో చేరిన వారంద‌రూ కృషి చేయాల‌ని సూచించారు. ఈ ఐదేళ్ల‌లో ప్ర‌జలపై ఎంతో భారం ప‌డింద‌న్నారు. నిత్య‌వ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, ఖ‌ర్చులు పెరిగిపోయి పేద ప్ర‌జ‌లంతా చితికిపోయార‌ని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు సంక్షేమం, అభివృద్ధి అందిస్తార‌ని హామీ ఇచ్చారు. ఇక క‌ర్నూల్లో కులం, మ‌తం చూడ‌కుండా త‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాలంటే మంచి నాయ‌కుడినైన త‌న‌కు మ‌ద్ద‌తివ్వాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నేత‌లు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఏసు, చంద్ర‌శేఖ‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author