శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి.. లక్ష విరాళం..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/04/816.jpg?fit=550%2C215&ssl=1)
జీవీ మాల్ యాజమాన్యం రూ.50వేలు
పల్లెవెలుగు వెబ్ : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామములో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు జరుగు అన్నదానము నిమిత్తం,ఎన్ టి ఆర్ జిల్లా,తిరువూరు వాస్తవ్యులు నరసింహ రావు దంపతులు రూ.1,00,006/-లు విరాళముగా శ్రీ స్వామి వారికి అందజేసినారు.అదేవిధముగా జంగారెడ్డిగూడెం నందు నూతనముగా ప్రారంభించబడిన జి.వి మాల్ వర్తకులు శ్రీ స్వామి వారి దేవస్థానమునకు సుమారు రూ.50,000/-లు విలువ గల కంప్యూటరును ఆలయ కార్యనిర్వహణాధికారి వారి చేతుల మీదుగా శ్రీ స్వామి వారికి అందజేసినారని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలియజేసినారు.