PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి.. లక్ష విరాళం..

1 min read

జీవీ మాల్​ యాజమాన్యం రూ.50వేలు

పల్లెవెలుగు వెబ్​ : ఏలూరు  జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామములో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు జరుగు అన్నదానము నిమిత్తం,ఎన్ టి ఆర్ జిల్లా,తిరువూరు వాస్తవ్యులు నరసింహ రావు దంపతులు రూ.1,00,006/-లు విరాళముగా శ్రీ స్వామి వారికి అందజేసినారు.అదేవిధముగా జంగారెడ్డిగూడెం నందు నూతనముగా ప్రారంభించబడిన జి.వి మాల్ వర్తకులు శ్రీ స్వామి వారి దేవస్థానమునకు సుమారు రూ.50,000/-లు విలువ గల కంప్యూటరును ఆలయ కార్యనిర్వహణాధికారి వారి చేతుల మీదుగా శ్రీ స్వామి వారికి అందజేసినారని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలియజేసినారు.

About Author