PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిత్తూరు జిల్లాలో లాఠీచార్జ్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లాలోని కల్లూరు మండలంలో టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 5 రోజుల క్రితం టీడీపీ నేత రాజారెడ్డిపై దాడికి పాల్పడ్డ.. వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేయాలని పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీ నేతపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయకుండా పోలీసులు వైసీపీ నేతలకు మద్దతు ఇస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ శ్రేణుల ఆందోళనకు పోటీగా వైసీపీ శ్రేణులు ర్యాలీ తీశారు. దీంతో కల్లూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.

                            

About Author