PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్య భగవానుడికి.. క్షీరపాయస నివేదన…

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలోని శ్రీ సూర్య దేవాలయంలో ధనుర్మాసంలో భాగంగా ఆదివారం సూర్య నారాయణ స్వామికి అష్టోత్తర శత పాత్రలతో విశేషమైనటువంటి క్షీరపాయస నివేదన పూజ మంత్ర పుష్పము నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు అనంతరం నివేదన పూజ చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి, సభ్యుల నేతృత్వంలో భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు.

About Author