PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఇద్దరు కొడుకులను కోల్పోవ‌డం.. గుండె బ‌రువెక్కింది’

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మాగంటి బాబు ఇద్దరు కుమారుల‌ను కోల్పోవ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాగంటి ర‌వీంద్రనాధ్ మృతికి సంతాపం ప్రక‌టించారు. పుత్ర శోకంతో ఉన్న మాగంటి బాబుకు.. మ‌ళ్లీ మ‌రో కుమారుడు మ‌ర‌ణించ‌డంతో వారి బాధ వ‌ర్ణణాతీతం అన్నారు. మాగంటి బాబు పుత్రశోకం చూసి త‌న గుండె బ‌రువెక్కింద‌ని చంద్రబాబు తెలిపారు. ఈ ప‌రిస్థితిని త‌ట్టుకునేలా మాగంటి బాబుకు ధైర్యం ప్రసాదించాల‌ని, వారి పుత్రుల ఆత్మకు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబునాయుడు తెలిపారు.

About Author