NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త‌గ్గ‌నున్న పామాయిల్, బంగారం ధ‌ర‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: కేంద్ర ప్ర‌భుత్వం ముడి పామాయిల్, శుద్ధి చేసిన పామాయిల్, ముడి సోయా ఆయిల్, బంగారం, వెండి దిగుమతిపై సుంకాలను తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు తగ్గాయి. దీంతో దేశీ వినియోగదారులకు ఊరట నిచ్చేందుకు వీలుగా కనీస దిగుమతి సుంకాలను తగ్గించింది. కేంద్ర సర్కారు ప్రతి పక్షం రోజులకు ఒక పర్యాయం వంట నూనెలు, బంగారం, వెండి దిగుమతులపై బేసిక్ డ్యూటీని సవరిస్తుంటుంది. భారత్ వంట నూనెలు, వెండి విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా, బంగారంలో రెండో అతిపెద్ధ (చైనా తర్వాత) దిగుమతిదారుగా ఉంది.

                                      

About Author