PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

1 min read

– గిద్దలూరు మహిళా నేతలతో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల

పల్లెవెలుగు వెబ్ గిద్దలూరు:  గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పట్టణంలోని మహిళానేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన మినీ మ్యానీఫెస్టోలో ప్రధాన అంశమైన మహాశక్తి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ ప్రవేశపెట్టిన “దీపం పథకం”, “ఆడబిడ్డ నిధి”, “తల్లికి వందనం”, “ఉచిత బస్సు ప్రయాణం” వంటి పథకాలను మహిళలకు, ఇంటింటికి వెళ్ళి వివరించాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా నేతలు బొంతా లక్ష్మీదేవి, చిటికెన లలిత, నంద్యాల రంగలక్ష్మి, గుంటూరి రవణమ్మ, సండ్రపాటి కోటేశ్వరమ్మ, వెలుతుర్ల మల్లేశ్వరి, ఆవుల లక్ష్మిదేవి, ఉలాపు కృష్ణవేణి, కొమరోలు ఉమా, తదితరులు పాల్గోన్నారు.

About Author