PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని పేసరా వాయి గ్రామానికి చెందిన వాసుదేవ రెడ్డి 42 సంవత్సరాలు విద్యుత్ షాకుతో మృతి చెందాడు మృతుని భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుడు వాసుదేవ రెడ్డి గత రెండు రోజుల క్రితం గాలివానతో విద్యుత్ స్తంభాలు పడిపోయి డిష్ వైరు తొలగిపోవడంతో సోమవారం నాడు గ్రంధి వేముల గ్రామంలో మసీదు పరిసర ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎక్కి కేబుల్ వైర్లు సరిచేస్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో విద్యుత్ షాక్ తో చేతులకు మరియు మెడ భాగాన బాగా కాలిపోవడంతో విద్యుత్ స్తంభము నుండి కిందపడి అక్కడికక్కడే మరణించాడని మృతుని భార్య  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి, మండల వైసిపి నాయకులు శివరాం రెడ్డి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

About Author