PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాముకాటుతో వ్యక్తి మృతి..

1 min read

పల్లెవెలుగు వెబ్:ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామానికి చెందిన కురువ శేఖర్ వయసు 57 సంవత్సరాలు తండ్రి పేరు కురువ రాముడు అను వ్వక్తి ఈనెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు లొద్దిపల్లి బస్టాండ్ దగ్గర పాము కాటు వేయగా బంధువులు మెరుగైన చికిత్స నిమిత్తం బాధితుడిని కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా  . శేఖర్ చికిత్స పొందుతూ కోల్కొనలేక గురువారం సాయంత్రం  మృతి చెందినట్లు  శేఖర్ భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు ఎస్సై మల్లికార్జున  కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతుడు శేఖర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం

About Author