బి ఫాం అందుకున్న మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/04/11-33.jpg?fit=550%2C366&ssl=1)
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి టిడిపి బి ఫాం అందుకున్నారు. ఆదివారం అమరావతి లో ఉండవల్లి చంద్రబాబు నివాసంలో ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులకు బి ఫాం ఇచ్చారు. ఇందులో భాగంగా మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి కి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బి ఫాం అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అసెంబ్లీ కి రావాలని పిలుపునిచ్చారు.