PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం టిక్కెట్​పై పునరాలోచిస్తాం..

1 min read

– టిడిపి జోన్ -5 కోఆర్డినేటర్ బీదా రవిచంద్ర యాదవ్

మంత్రాలయం, పల్లెవెలుగు: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పునారాలోచన చేస్తాం అని టిడిపి జోన్ 5 బీద రవిచంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి  అధ్వర్యంలో జరిగిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జోన్ -5 కోఆర్డినేటర్ బీదా రవిచంద్ర యాదవ్, టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బిటి నాయుడు, ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి , యం పి డాక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో అభిప్రాయాలు, సలహాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  జోన్ -5 కోఆర్డినేటర్ బీదా రవిచంద్ర యాదవ్, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీటి నాయుడు మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మీరు చెప్పిన అభిప్రాయాలు టిడిపి అధినేత అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పునారాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డి  కి ఇవ్వాలని తెలియజేస్తాం అని హామీ ఇచ్చారు.  ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, మాధవరం అమర్నాథరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author