PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బహుజన సమాజ్ పార్టీలో పలువురి చేరిక

1 min read

ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం, జిల్లా ఇన్చార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ

పల్లెవెలుగు వెబ్  కల్యాణదుర్గం : బహుజనులకు కంచుకోటగా ఉన్న కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పలువురు శుక్రవారం బహుజన సమాజ్ పార్టీలో చేరారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రెండు రాష్ట్రాల సంస్కృతులను ఇక్కడి ప్రజలు పాటిస్తూ ఉంటారు. సాంఘికంగా అనేక కట్టుబాట్లకు లోనై జీవిస్తున్న ఈ ప్రాంతంలోని ప్రజల్లో చైతన్యం వస్తోంది. బహుజనులకు రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న బహుజన సమాజ్ పార్టీ  సిద్ధాంతానికి ఆకర్షితులై  పార్టీలో చేరినట్లు  బి ఎస్ పి లో చేరిన వారు తెలిపారు. స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ఉన్న ఒక ప్రైవేటు భవనంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశానికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగభూషణం, జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈనెల 11న తిరుపతిలో నిర్వహించే జోనల్ స్థాయి సమీక్ష సమావేశానికి నియోజకవర్గం నుంచి కమిటీ సభ్యులు కచ్చితంగా హాజరు కావాలని వారు సూచించారు. అనంతరం కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ శ్వేతఅనితను జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం పార్టీలోకి ఆహ్వానించారు. తన భర్త బోయ హరీష్ కూడా త్వరలో బహుజన సమాజ్ పార్టీలో చేరుతారని శ్వేత ప్రకటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ నాగమ్మ, సురేంద్ర, పురుషోత్తం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బహుజన సిద్ధాంతం నచ్చి పార్టీలో చేరాము.. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం నుంచి తాము బహుజన సమాజ్ పార్టీలో చేరామని బోయ శ్వేత తెలిపారు. తన భర్త హరీష్ కూడా త్వరలో పార్టీలో చేరుతారని చేరతారని ఆమె ప్రకటించారు. బహుజనులంతా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. పార్టీని గడపగడపకు తీసుకెళ్లి బలోపేతం చేయడానికి కృషి చేస్తారని తెలిపారు. బహుజనులు అంతా పార్టీలో చేరడానికి ముందుకు రావాలని కోరారు.

About Author