PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కెట్ యార్డు చైర్మన్ రాహత్ రాజీనామా..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి షేక్ రాహత్ జబ్బార్ సోమవారం మధ్యాహ్నం రాజీనామా చేశారు.తన వ్యక్తిగత కారణాల వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.రాజీనామా పత్రాన్ని మార్కెట్ యార్డు ఇంఛార్జి సెక్రటరీ యన్.రామచంద్రయ్యకు అందజేశారు.ఈ సందర్భంగా రాహత్ జబ్బార్  మాట్లాడుతూమార్కెట్ యార్డు అభివృద్ధికి నా వంతు కృషి చేశానని రైతులకు అన్ని విధాలుగా సేవలందించామని అన్నారు.నా వ్యక్తిగత కారణాల వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేశానని నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చిన మా నాయకుడు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా మార్కెట్ ప్రాంగణంలో ఆమె మరియు ఆమె భర్త జబ్బార్ చెట్లను నాటారు.

About Author