PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిలోకి భారీగా చేరిక‌లు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో పార్టీలోకి చేరిక‌లు జ‌రిగాయి. 22వ వార్డుకు చెందిన హ‌మీద్ వైసీపీని వీడి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వైసీపీకి చెందిన‌ న‌రేష్‌, వెంక‌ట‌స్వామి, నాగ‌రాజు, కుమార్‌లు టిడిపిలో చేరారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఈ వార్డులో 25 శాతం మాత్ర‌మే పోలింగ్ జ‌రగ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌న్నారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లంద‌రూ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చి ఓటు వేసేలా కృషి చేయాల‌ని సూచించారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్రజ‌లంద‌రికీ ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఇక క‌ర్నూల్లో తాను తీసుకొచ్చిన సూప‌ర్ 6 గ్యారెంటీల వ‌ల్ల న‌గ‌రం రూపురేఖ‌లు మారిపోతాయ‌న్నారు. ప్ర‌జ‌లంతా త‌నకు ఓటు వేసి గెలిపించాల‌ని భ‌రత్ కోరారు. పార్టీలో చేరిన వారిలో దిన‌క‌ర్, అబ్దుల్ మ‌జీద్, మ‌ద్దిలేటి, అక్బ‌ర్ లు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి అబ్దుల్ ర‌జాక్, న‌గ‌ర అధ్య‌క్షుడు నాగ‌రాజు యాద‌వ్‌, తెలుగు యువ‌త పార్ల‌మెంటు అధ్య‌క్షుడు అబ్బాస్, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ముంతాజ్, జ‌న‌సేన ఇంచార్జి అర్ష‌ద్, రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, సీనియర్ నాయకులు రామాంజ‌నేయులు, బాబ్జి, నాయ‌కులు, బూత్ ఇంచార్జీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author