PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

49వ డివిజన్ లో వైసిపి కార్యకర్తల సమావేశం..

1 min read

కార్యకర్తలు డివిజన్లో సైనికుల్లా పని చేయాలిఎమ్మెల్యే ఆళ్ల నాని

పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు, వైసిపి నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  నియోజకవర్గం 49 డివిజన్ లో కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి  ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మాజీ ఉపముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు జిల్లా అధ్యక్షులు   ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు, అదేవిధంగా కుల మతాలకతీతంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలు ఓటర్లకు సైనికులుగా వారి వెంట నిలబడి రథసారథ్యం వహించాలన్నారు. ఎవరికి ఏ కుటుంబంలో అవసరం వచ్చిన వారికి వెన్నదన్నగా ఉండి ఆ సమాచారాన్ని సంబంధిత నాయకులకు తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు, గుడిదేశీ శ్రీనివాస్, నూక పెయి సుధీర్ బాబు,ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్  నెరసు చిరంజీవి, డివిజన్ ఇంచార్జ్ పల్ల రమేష్ ,  క్లస్టర్ 3 ప్రెసిడెంట్ మంచెం మైబాబు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు , 49 వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

About Author