PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

23న మిడుతూరు చెన్నకేశవ స్వామి రథోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ఈనెల 23వ తేదీన సా.5:30 కు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్య నిర్వహణాధికారి ఏడి వెంకట రమణ తెలిపారు.ఈ నెల 21 నుంచి 24 వరకు ఉ-సా ప్రదోష పూజలు హోమం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈరోజు 21న స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఉ.8 గంటలకు శేష వాహనం, 22న సింహ వాహనం గరుడోత్సవం,24న తీర్థావళి పూర్ణాహుతి సాయంత్రం పారువేట ఉత్సవం ఉంటుందని ఏడి వెంకటరమణ తెలిపారు.ఈ రథోత్సవ కార్యక్రమం సక్రమంగా జరుగుటకు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.రథోత్సవం సందర్భంగా ఆలయానికి ప్రత్యేకంగా రంగులతో అలంకరిస్తున్నారు.

About Author