PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిలోకి వైసీపీ నాయకుల వలసలు.. మాజీ సింగిల్ విండో చైర్మన్ టిడిపిలోకి

1 min read

పల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపాకు షాక్ ల మీద షా క్ లు తగులుతూనే ఉన్నాయ్..కానీ అధికార పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు నిన్న ప్రచారానికి సాయంత్రం 5 గంటలకు పార్టీల ప్రచారాలు ముగిశాయి.నిన్న శనివారం మధ్యాహ్నం చివరి రోజున కూడా టిడిపిలోకి వలసలు జోరందుకున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన మాజీ సహకార సొసైటీ చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి తో పాటు డాక్టర్ పి మాలిక్,జాఫర్ తదితరులు జయరాం రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఖాజా మొహిద్దిన్ ఆధ్వర్యంలో  టిడిపి పార్టీలో చేరారు.అదేవిధంగా నందికొట్కూరు పట్టణానికి చెందిన 19వ వార్డు మల్లేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కొప్పుల వెంకటరెడ్డి గుర్రాల సుబ్బారెడ్డి, గుర్రాల రామకృష్ణ,సాయి, పుల్లారెడ్డి,శివ,వెంకటేష్ తదితర కుటుంబాలు టిడిపి పార్టీలో చేరారు వీరందరికీ శివానందరెడ్డి మరియు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పగిడాల టిడిపి మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author