PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీని వీడి.. కాంగ్రెస్​లో చేరిన ముస్లిం మైనార్టీలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని 8వ వార్డు దండిగేరి, 48వ వార్డు రోజా దర్గాలోని ముస్లిం మైనార్టీలు  30 కుటుంబాలు వైసీపీని వీడి… కాంగ్రెస్​లో చేరారు. కర్నూలు పార్లమెంటు అభ్యర్థి లక్కీ 2 రాంపుల్లయ్య యాదవ్​ నేతృత్వంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ సందర్భంగా రాంపుల్లయ్య యాదవ్​ మాట్లాడుతూ కర్నూలు నగరంలో తాగునీటి సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రాజెక్టుల పూర్తి ఒక్క కాంగ్రెస్​తోనే సాధ్యమన్నారు. దేశ ప్రజలు.. కాంగ్రెస్​ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా రాంపుల్లయ్య యాదవ్​ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రజలను కోరారు.

About Author