మంత్రి కొడాలి నాని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనపు భద్రత
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2021/11/unnamed.jpg?fit=512%2C315&ssl=1)
పల్లెవెలుగు వెబ్: ఏపీ అసెంబ్లీ ఇటీవల జరిగిన పరిణామాలతో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనపు భద్రతను కల్పించింది ప్రభుత్వం. చంద్రబాబు అంశంపై అనంతరం సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. మంత్రి నానికి ఇప్పటికే 2 ప్లస్ 2 భద్రత ఉండగా అదనంగా 1 ప్లస్ 4 భద్రతతోపాటు కాన్వాయ్లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కేటాయించారు. అలాగే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అదనంగా 3+3 గన్మన్లతో భద్రత కల్పిస్తున్నారు.