PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధాన కార్యదర్శిగా పఠాన్ అలీ ఖాన్ ఎంపిక

1 min read

పల్లెవెలుగు , వెబ్​ చెన్నూరు : జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పిఎండి అలీ ఖాన్ ఎంపిక పట్ల మండల రెవెన్యూ సిబ్బంది, హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు సోమవారం, మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ పఠాన్ అలీ ఖాన్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెవెన్యూ కార్యాలయాలలో సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని సత్వరంగా సానుకూలంగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుందని రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు, ఈ పదవికి పటాన్ అలీ ఖాన్ అన్ని విధాల న్యాయం చేయగలరని భావించి వారిని రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని, రెవెన్యూలో అన్ని విభాగాల వారిని కలుపుకొని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఆయన దోహదపడతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

About Author