PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టిసీమ మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

1 min read

ఎలాంటి అవాచనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పోలవరం మండలంలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టిసీమ ప్రాంతాన్ని సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాచనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చెయ్యాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం సీఐ గుమ్మళ్ల మధుబాబు, ఎస్సై పవన్ కుమార్, పోలీసు సిబ్బంది ఆలయ ట్రస్ట్  జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.

About Author