NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎప్పటిలాగే ఇళ్ల వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయండి

1 min read

నగరపాలక సంస్థ మేనేజర్ రాముడికి వినతిపత్రం అందజేసిన టిడిపి నాయకులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల కమిషన్ వాలంటీర్లను దూరంగా ఉంచిన నేపథ్యంలో ఇతర ఉద్యోగులను వినియోగించి ఇళ్ల వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ నగరపాలక సంస్థ మేనేజర్ రాముడుకు తెలుగుదేశం పార్టీ తరఫున వినతిపత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి, టిడిపి నాయకులు అబ్బాస్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ దూరంగా ఉంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర ఉద్యోగులను వినియోగించి ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీకి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అడ్డు కాదని, ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులను వినియోగించి పంపిణీ చేయాలని కోరుతున్నామని తెలిపారు.  పింఛన్దారుల సొమ్మును కూడా కాజేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా తెలుగుదేశం పార్టీపై ఎన్నికల కమిషన్ పై నిందలు వేస్తుందని వారు విమర్శించారు.

About Author