PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిని గెలిపించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్ర‌జ‌లంద‌రూ సిద్ధంగా ఉన్నార‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని 1వ వార్డు ఖండేరిలో న‌గ‌ర‌మా మేలుకో కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌ను క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల‌ని కోరారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ వైసీపీ నాయ‌కులు అడ్డా అనుకుంటున్న ఈ ప్రాంతంలో ప్ర‌జ‌లు టిడిపికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని చెప్పారు. అర్హుల‌కు పింఛ‌న్లు లేక‌, ఇళ్ల ప‌ట్టాలు అంద‌క‌, ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నా సొంత గృహాలు లేక ఇక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ప్ర‌జ‌లు త‌మ దృష్టికి తీసుకొచ్చార‌ని భ‌ర‌త్ తెలిపారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఓటు అడుగుతుంటే త‌ప్ప‌కుండా టిడిపికి ఓటు వేస్తామ‌ని హామీ ఇస్తున్నార‌న్నారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా త‌మ గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు తీరాలంటే రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని, క‌ర్నూల్లో తాను ఎమ్మెల్యే అవ్వాల‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన అసెంబ్లీ ఇంచార్జి అర్ష‌ద్, టిడిపి న‌గ‌ర అధ్య‌క్షుడు నాగ‌రాజు యాద‌వ్‌, సీనియ‌ర్ నేతలు మ‌న్సూర్ ఆలీఖాన్‌, అబ్బాస్‌, వార్డు నేత‌లు మారుతీ శ‌ర్మ‌, భాస్క‌ర్‌, మున్నా, ప్ర‌భాక‌ర్‌, ఆనంద్, అయాత్ బీ, కిర‌ణ్‌, ర‌మీజ్ బాషా, బాలు, ఆనంద్‌, సాయి, పౌలు, మ‌ల్లికార్జున‌, జ‌న‌సైనికుడు ప్ర‌కాశ్‌, బూత్ ఇంచార్జీలు, టిడిపి ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

About Author