PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా !

1 min read

పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయన్నారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇటీవల ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే నోటిఫికేషన్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీపీఎస్సీ. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని వచ్చే సంవత్సరం (2023) జనవరి 08న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి వెబ్ నోట్ ను రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్ 1 అడ్మిట్ కార్డులను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

About Author