NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : బుట్టా రేణుక

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి”  ఆదేశాల మేరకు శిల్పా ఎస్టేట్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈనెల 18వ తేదీన అనంతపురంలో జరిగే సిద్ధం..! కార్యక్రమంపై ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక పోస్టర్లను విడుదల చేశారు. ఎమ్మిగనూరు నుంచి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం సిద్దాం కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘు వైస్ చైర్మన్ నజీర్ పట్టణ అధ్యక్షులు బుట్ట రంగయ్య వార్డు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలాని కోరారు. సమావేశం అనంతరం సిద్దాం కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు.

About Author