రైతుల దెబ్బకు తిగొచ్చిన కేంద్రం… ప్రధాని సంచలన ప్రకటన
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2021/11/Capture-25.jpg?fit=964%2C531&ssl=1)
పల్లెవెలుగువెబ్: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు ఢిల్లీ పరిసరాల్లో ఆందోళన చేస్తున్న రైతుల దెబ్బకు దిగివచ్చింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇవాళ ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, వ్యవసాయ చట్టాలను వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు.