PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూర్ణాహుతితో ముగియనున్న రాహు కేతు విగ్రహ ప్రతిష్ట

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది క్షేత్రంలో శుక్రవారం రాహు ,కేతు విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అదే రోజు శాస్త్ర యుక్తంగా వేదమంత్రోచనాలు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. రాహు మరియు కేతు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా రుత్వికుల చేత ప్రత్యేక యజ్ఞ యాగాదుల కార్యక్రమం క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు గురువారం రెండవ రోజున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుండగా వర్షం కురవడం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని పేర్కొన్నారు. 

About Author